నందిగామ మండలం చందాపురం జాతీయ రహదారిపై నిర్మితమవుతున్న 6వే పనులను నిలుపుదల చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు నూతనంగా నిర్మించే జాతీయ రహదారి చుట్టుపక్కల పాఠశాల పిల్లలు , సుమారు 400 ఎకరాల భూ యజమానులు రాకపోకలకు అడ్డంకులు కలిగించే విధంగా జాతీయ రహదారి నిర్మితమవుతున్నది ఆ ప్రాంతంలో అండర్పాస్ ఏర్పాటు చేయాలని గతంలో హైవే అధికారులకు పలుమార్లు తెలిపిన మా మాటను పెడచెవిన పెడుతున్నారని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.అండర్ పాస్ లు ఏర్పాటు చేయటం వల్ల స్కూల్ పిల్లల, ఆ ప్రాంతం భూ యజమానులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని రైతులు వాపోతున్నారు తక్షణమే జాతీయ రోడ్డు రవాణా సంస్థ అధికారులు తమ సమస్యను పరిశీలించి అండర్ పాస్ లను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
6వే పనులను నిలుపుదల చేయాలి